నట్టి కరుణ, రాజీవ్, సుపూర్ణ మాలకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డీఎస్జే’(దయ్యంతో సహజీవనం). నట్టి కుమార్ దర్శకుడు. క్రాంతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను శనివారం విడుదలచేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘చదువులో బంగారుపతకం సాధించిన ఓ యువతిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు? వారిపై ఆమె ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నదన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. షూటింగ్ పూర్తయింది. కశ్మీర్లో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. బాబుమోహన్, హేమంత్ కీలక పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రవిశంకర్.