బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక కంటెస్టెంట్స్ రేంజ్ పెరిగిపోతుంది. వాళ్లకు వరుస ఆఫర్స్ రావడం, సెలబ్రిటీ రేంజ్ కూడా పెరుగుతూ పోతుండడంతో కాస్ట్ లీ కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు కొంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. బిగ్ బాస్ షోకి వెళ్లొచ్చిన చాలా మంది ఇప్పటికే కాస్ట్ లీ కార్లు కొనగా, ఇప్పుడు ఆ లిస్ట్లో చేరింది దేవి నాగవల్లి.
న్యూస్ రీడర్గా బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టిన దేవి ప్రేక్షకులని బాగానే ఎంటర్టైన్ చేసింది. అయితే ఊహించని విధంగా మూడో వారమే హౌజ్ నుండి బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్కు చెందిన కంటెస్టెంట్స్లో అరియానాతోనే ఆమె ఇప్పటికీ టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అనుకోకుండానో లేదా యాదృశ్చికంగానో ఏమో గానీ అరియానా, దేవీ నాగవల్లి ఇద్దరూ కూడా ఒకేసారి కొత్త కారు కొన్నారు.
అరియానా కొత్త కారు కొని సోహెల్, అమర్ దీప్లతో చక్కర్లు కొట్టింది. మరో వైపు దేవి నాగవల్లి స్కోడా కార్ కొనుగోలు చేసి, దానితో సెల్ఫీ దిగింది. పాతిక లక్షల రూపాయల పైనే ఈ కారు ఉంటుందని తెలుస్తుంది. ఇటీవలి కాలంలో బిగ్ బాస్ నుండి వచ్చిన కంటెస్టెంట్స్లో అఖిల్, సోహెల్, శివ జ్యోతి వంటి వారు కాస్ట్ లీ కార్లు కొని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయం విదితమే.