చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐకూ సరికొత్త 5G ఫోన్లను ఆవిష్కరించింది. ఐకూ 7, ఐకూ 7 లెజెండ్ స్మార్ట్ఫోన్లను సోమవారం భారత్లో విడుదల చేసింది. ఐకూ 7 ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 5G చిప్సెట్, 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 4,400 mAh బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరోవైపు ఐకూ 7 లెజెండ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, OIS తో కూడిన 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 4,000 mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐకూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. ఐకూ 7 ఫోన్ను 66 W ఫ్లాష్ ఛార్జర్తో కేవలం 33 నిమిషాల్లోనే సున్నా నుంచి 100 శాతం వరకు ఛార్జింగ్ చేయొచ్చు. ఈ రెండు ఫోన్లను అమెజాన్ ఇండియా, ఐకూ డాట్కామ్ ద్వారా మే 1 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ ఆఫర్లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 3వేల వరకు తగ్గింపు వర్తించనుంది.
ఐకూ 7 ధరలు ఇవే:
8 GB RAM + 128 GB స్టోరేజ్ : Rs 31,990
8 GB RAM + 256 GB స్టోరేజ్: Rs 33,990
12 GB RAM + 256 GB స్టోరేజ్: Rs 35,990
ఐకూ 7 లెజెండ్:
8 GB RAM + 12 GB స్టోరేజ్: Rs 39, 990
12 GB RAM + 256 GB స్టోరేజ్: Rs 43, 990