మల్దకల్, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని బిజ్వారం, అమరవాయి, ఎల్కూర్, మల్లెందొడ్డి, విఠలాపురం, మద్దెలబండ గ్రామాల్లో రైతు వేదిక భవనాలను జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయరంగం అభివృద్ధి చెందితేనే దేశం వృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ గొప్పతనమేనన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు. ప్రభుత్వం అందించే వ్యాక్సిన్ల ను ప్రతిఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రా మాల్లో రైతు వేదికలు నిర్మించిందన్నారు.
ఇక్కడ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే అవకాశం ఉన్నదన్నారు. ఏ పంటలు వేయాలో మట్టి నమూనాలు పరిశీలించిన తర్వాతే అధికారుల సలహా మేరకు పంటలు సాగు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో రైతులు తమ పంట కు తామే మద్దతు ధర నిర్ణయించే అవకాశం ఉం దన్నారు. అనంతరం మల్దకల్, మల్లెందొడ్డిలో నిర్మించిన పల్లెప్రకృతి వనాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, విండో చైర్మన్ తిమ్మారెడ్డి, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచులు లక్ష్మన్న, అంజి, శివరామిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, యాకో బు, జయమ్మ, ప్రతాప్, ఎంపీటీసీలు గోపాల్రెడ్డి, రూతమ్మ, పరశురాముడు, మార్కెట్ కమి టీ డైరెక్టర్ సవారన్న, నాయకులు సత్యారెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, అజయ్, నర్సింహారెడ్డి, తూంకృష్ణారెడ్డి, వెంకటన్న, భాస్కర్గౌడ్, ఆంజనేయులు, ఎల్లప్ప, మధు, పరుశ, తిమ్మరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.