స్పోర్ట్స్ పర్సనాలిటీస్ జీవిత నేపథ్యంలో కొందరు భామలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాప్సీ.. మిథాలీ రాజ్ జీవిత నేపథ్యంలో శభాష్ మిథు అనే చిత్రం చేస్తుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే.. పీవీ సింధు జీవిత నేపథ్యంలో సినిమా చేయనుందా అనే అనుమానం తాజాగా చక్కర్లు కొడుతున్న ఫొటోలు, వీడియోలు చూస్తుంటే అర్ధమవుతుంది.
దీపికా, పీవీ సింధు సరదాగా బ్యాడ్మింటర్ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, కొద్ది క్షణాలలోనే వైరల్ అయ్యాయి. కేవలం కేలరీలను కరిగించడానికే బ్యాడ్మింటన్ ఆడినట్లు ఈ స్టార్లు చెప్పుకొచ్చారు. పీవీ సింధుతో కేలరీలు కరిగించేందుకు సరదాగా మ్యాచ్ ఆడానంటూ దీపికా తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది.
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ లో ఒకరైన సింధుతో మ్యాచ్ ఆడడం సంతోషంగా ఉంది అని దీపికా పేర్కొంది. అయితే దీపికా పోస్ట్ కి పీవీ సింధు.. ఎన్ని కేలరీలు కరిగించావ్ అంటూ ఓ వీడియోని పంచుకుంది. దీపికా, క్యాలరీలని మరచిపో నా శరీరంచాలా బాధగా ఉంది అంటూ పీవీ సింధు పేర్కొంది. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ లు వైరల్ గా మారాయి.