పాటియాల: భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా సోమవారం ఈటెను 63.24 మీటర్ల దూరం విసిరి స్వర్ణం నెగ్గిన అన్ను.. గతంలో తన పేరిటే ఉన్న రికార్డు (62.43 మీ.)ను మెరుగు పర్చుకుంది. అయితే ఒలింపిక్ క్రీడల అర్హత మార్క్ (64 మీ.)ను మాత్రం ఆమె చేరుకోలేకపోయింది.