కరోనా మహమ్మారి విజృంభణ వలన డిజిటల్ మీడియాకు ఆదరణ బాగా పెరిగింది. చిన్న హీరోలే కాదు బడా హీరోలు సైతం ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా రాధే అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 13న ఈ సినిమాను థియేటర్స్తో పాటు ఓటీటీలో ఓకే సారి విడుదల చేయబోతున్నారు. ఇలా థియేటర్, ఓటీటీలో చిత్రం విడుదల కావడం ఇదే తొలిసారి.
రాధే సినిమాకు సంబంధించిన పూర్తి హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఓటీటీలో పే పర్ వ్యూ ఫార్మాట్ ప్రకారం రాదే సినిమాను 249 రూపాయలు ఆన్ లైన్ ద్వారా ఖర్చు చేసి చూడాల్సి ఉంటుంది. మూవీని జీ ప్లెక్స్, జీ 5 లో విడుదల చేయబోతున్నారు. తాజాగా జీ సంస్థ సల్మాన్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. రూ.499 రూపాయలతో సినిమాని చూసే ఛాన్స్ దక్కించుకోవడంతో పాటు ఏడాది మొత్తం సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చని తెలియజేసింది. కాగా, మొదటిసారి ఇంత పెద్ద సినిమా ఈ ఫార్మాట్ లో రిలీజ్ అవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికైతే ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకోగా, సినిమా ఎంతటి విజయం సాధిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
ఇండియాకు ఆక్సిజన్ కోసం ఓవర్టైమ్ పని చేస్తున్నాం: చైనా