న్యూఢిల్లీ: దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఇటీవల కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న మిల్కా సింగ్తో శుక్రవారం ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు దవాఖానా సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రికి అత్యవసర పనులు ఉన్నప్పటికీ తన తండ్రి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉందని మిల్కాసింగ్ తనయుడు జీవ్ మిల్కా సింగ్ పేర్కొన్నాడు.