ముంబై: తన భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని టీమ్ఇండియా బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. త్వరలోనే మళ్లీ మైదానంలో అడుగుపెడతానని సోషల్మీడియా ద్వారా ప్రకటించాడు. మార్చి 23న ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయస్ భుజానికి గాయమైంది. గాయమైన ఎడమ భుజానికి గురువారం అతడు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
‘సర్జరీ సక్సెస్.. ధృడసంకల్పంతో అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. మీ అందరి విషెస్కు కృతజ్ఞతలు’ అంటూ శ్రేయస్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా హాస్పిటల్లో బెడ్పై ఉండగా దిగిన ఫొటోను షేర్ చేశాడు.
గాయంతో వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి శ్రేయస్ దూరమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యర్ దూరమవడంతో అతని స్థానంలో యంగ్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు జట్టు పగ్గాలు అప్పగించారు. అయ్యర్ కోలుకోవడానికి కనీసం 3-4 నెలలు పటే అవకాశం ఉంది.