మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. 11 ఏళ్ల కింద వచ్చిన ఖలేజా సినిమా తర్వాత ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదు. మళ్లీ ఈ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతున్నట్లు హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటివరకు అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు క్లాసిక్గా నిలిచాయి. ఆ తర్వాత 11 ఏళ్లు అయిన ఈ కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు. దీంతో త్రివిక్రమ్, మహేశ్ మధ్య ఏదో గొడవ జరిగిందని.. అందుకే కలిసి పనిచేయడం లేదనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా రాబోతోంది. దానికి తగ్గట్లుగానే త్వరలోవనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి 2022 సమ్మర్కు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఇదే ఏడాది పూర్తి చేయనున్నాడు మహేశ్. మరోవైపు ఈ సినిమా తర్వాత వెంటనే మహేశ్, త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది. ఏదేమైనా కూడా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం