తిరుపతి, జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో అయా శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహవాహనోత్సవం ద్వారా స్వామివారు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు దర్శనమివ్వనున్నారు.