శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడు. గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మాతలు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. ముగ్గురు అంకుల్స్, ముగ్గురు ఆంటీలు పండించే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. ఇటీవల విడుదల చేసిన చిత్ర టైటిల్ లిరికల్ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. శ్రీముఖి నృత్యాలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులకు ఆద్యంతం చక్కటి హాస్యాన్ని అందించే చిత్రమిది’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.బాల్రెడ్డి, సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సాయిబాబు వాసిరెడ్డి, గిరిధర్ మామిడిపల్లి, నిర్మాణ సంస్థలు: గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్, కథ, మాటలు: డార్లింగ్స్వామి.