శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడు. గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మాతలు. ఆగస్ట్లో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలో ‘పార్టీ పార్టీ ఇది యాభైఏళ్ల పార్టీ..హాఫ్ సెంచరీ కొట్టేశారు బిజీ లైఫ్ తోటి..’ అనే టైటిల్ లిరికల్ సాంగ్ను ఆదివారం యువ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. నిర్మాత బొడ్డు అశోక్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది’ అన్నారు. ‘ఈ సినిమాను మే నెలలో విడుదల చేద్దామని ప్లాన్ చేశాం. కరోనా సెకండ్వేవ్ ప్రభావంతో ఆగిపోయింది. ముగ్గురు అంకుల్స్, ముగ్గురు ఆంటీలు పండించే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది’ అని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర, శ్రీవాస్, రఘు కుంచె, కాసర్ల శ్యామ్, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అదుర్స్ రఘు, గిరిధర్, హేమ, గాయత్రి భార్గవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.బాల్రెడ్డి, సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సాయిబాబు వాసిరెడ్డి, గిరిధర్ మామిడిపల్లి, నిర్మాణ సంస్థలు: గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్, కథ, మాటలు: డార్లింగ్స్వామి, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.