కొద్ది రోజుల క్రితం శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్టు అఫీషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. బహుభాషా చిత్రంగా ఈ మూవీని ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ హాలీవుడ్ మూవీ షూటింగ్లో భాగంగా అమెరికాలో ఉన్నారు. ఆ షూటింగ్ పూర్తైన తర్వాత శేఖర్ కమ్ముల మూవీ మొదలు పెట్టనున్నాడు.
క్లాసీ డైరెక్టర్తో మాస్ హీరో మూవీ అనే సరికి అందరిలో ఆసక్తి నెలకొంది. స్టోరీ ఎలా ఉంటుందోననే సందేహాలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. గతంలో రానాతో శేఖర్ కమ్ముల లీడర్ అనే సినిమాగా చేయగా, ఇదే స్టైల్లో ధనుష్ మూవీ ఉంటుందని టాక్. పొలిటికల్ టచ్తో శేఖర్ కమ్ముల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. కాగా, ఇన్నాళ్లు డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులని అలరించిన ధనుష్ తొలిసారి స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నాడు.