నందమూరి హీరోలతో మల్టీస్టారర్ చేస్తే చూడాలని అభిమానుల కోరిక. కొన్నాళ్ల నుండి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని కలను తీర్చేందుకు అనీల్ రావిపూడి పక్కా స్ట్రిప్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అనీల్ ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో ఎఫ్ 2 అనే చిత్రాన్ని తెరకెక్కించగా, ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మరి కొద్ది రోజులలో ఈ మూవీ విడుదల కానుంది.
ఎఫ్ 3 చిత్రం రిలీజ్ అయ్యాక అనీల్ రావిపూడి. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో మల్టీ స్టారర్ చిత్రాన్ని రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్యాణ్ రామ్ కి ఎప్పటి నుంచో.. బాబాయ్ బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని వుంది. ఇప్పుడు ఆ కోరికను అనీల్ రావిపూడి తీర్చనున్నట్టు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే అనీల్ రావిపూడి- కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో పటాస్ అనే చిత్రం రూపొందగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.