ములుగు : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య రంగం బలోపేతమవుతున్నది. ఇది పేద ప్రజలకు వరంగా మారబోతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన టి – డయాగ్నస్టిక్ సెంటర్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో నేడు 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.
బడ్జెట్లో కేటాయించిన దానికి అదనంగా పది వేల కోట్ల రూపాయలను ఆరోగ్య రంగంలో ఖర్చు పెట్టడంతో వైద్య రంగం దశ మారనుందన్నారు. జిల్లాలో టి- డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించుకోడం సంతోషంగా ఉందన్నారు. ఈ సెంటర్ లో 57 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రంలో అందరికీ హెల్త్ ప్రొఫైల్ ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
ప్రమాదం జరిగినపుడు అత్యవసర సమయంలో మొదటి గంట సరైన వైద్యం అందించేందుకు చాలా ముఖ్యమైంది. ఆ సమయంలో వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతో సమయం వృథా అవుతుందని, హెల్త్ ప్రొఫైల్ ఉంటే సరైన సమయంలో సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు.
ఈ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడానికి సిరిసిల్లతో పాటు ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు ఈ జిల్లా ఇంచార్జి మంత్రిగా, గిరిజన బిడ్డగా సీఎం కృతజ్ఞతలని తెలిపారు.
త్వరలో గుండె సంబంధ అన్ని పరీక్షలు కూడా ఈ టి – డయాగ్నస్టిక్ సెంటర్ లో చేసుకునే అవకాశం వస్తుందన్నారు.
కరోనాను పూర్తిగా కట్టడి చేయడంలో అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, పీఓ హన్మంతు జేండగే తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
వైద్య ఆరోగ్య శాఖ మరింత బలోపేతం : మంత్రి నిరంజన్ రెడ్డి