ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టార్ హీరోలతో వైవిధ్యమైన స్టెప్పులు వేయించి అలరించిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలకు పని చేస్తూనే మరో వైపు పలు షోస్కు జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండే శేఖర్ మాస్టర్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు తను పడ్డ బాధలు గుర్తొచ్చి కన్నీరు పెట్టుకున్నారు.
బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న షోస్లో కామెడీ స్టార్స్ ఒకటి. వర్షిణి సౌందరరాజన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అవినాష్ అండ్ టీం జూనియర్ ఆర్టిస్ట్స్ తిండి కోసం, మనీ కోసం ఎంతలా ఇబ్బంది పడతారో కంటికి కట్టినట్టు చేసి చూపించారు. ఇది చూసి చాలా ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్ తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఎడ్చేశాడు. ఆయన గతాన్ని విన్న వర్షిణి, కంటెస్టెంట్స్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ షోలో శ్రీదేవి విజయ్ కుమార్ మరో హోస్ట్గా ఉన్న విషయం తెలిసిందే.