స్వీయ దర్శకత్వంలో చిరంజీవి కుంచల్ హీరోగా నటిస్తున్న ‘ఎస్.కె’ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సర్దార్ సుర్జీత్సింగ్ నిర్మాత. సీనియర్ నటుడు పృథ్వీ కుమార్తె శ్రీలు కథానాయికగా పరిచయమవుతోంది. హీరో, దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథాంశమిది. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుంది. పృథ్వీ కీలక పాత్రలో నటిస్తున్నారు’ అన్నారు. ముప్పైరోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. గడ్డం నవీన్, అభిరామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వలి, సంగీతం: శ్రీవెంకట్, దర్శకత్వం: చిరంజీవి కుంచల్.