కరోనా మహమ్మారి తమిళ సినీ పరిశ్రమపై పగబట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే కోలీవుడ్కు సంబంధించి కమెడీయన్స్, నిర్మాతలు, దర్శకులు, రచయితలు కన్నుమూసారు. సీనియర్ గాయకుడు, నటుడు టీకేఎస్ నటరాజన్(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయన శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.
తాజాగా ప్రముఖ కమెడియన్ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు. కరోనాతో కొద్ది రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే పాండు భార్యకు కూడా కరోనా సోకగా, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాండు మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 1970 లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేసిన పాండు ‘కరైల్లెం షేన్బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.