ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించిన మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మల్టీ స్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తెలుస్తుండగా,మరి కొద్ది రోజులలోనే మూవీ షూటింగ్ పూర్తి చేయనున్నారు. కరోనా లేకపోయి ఉంటే మూవీ ఇప్పటి వరకు విడుదలై ఉండేది కూడా. అయితే గత కొద్ది రోజులుగా మహేష్- మణిరత్నం కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది.
తాజాగా ఈ వార్తలపై మణిరత్నం స్పందించారు. మహేశ్ కి తాను కథ చెప్పడం నిజమేనని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. మహేష్ కథ విన్నాడు, కాని కొన్ని కారణాల వలన మూవీ వర్కవుట్ కాలేదు. త్వరలో తెలుగు సినిమా పక్కా చేస్తాను. మహేష్ తో సినిమా చేయడానికి సమయం, సందర్భం రావాలి అని మణిరత్నం అన్నారు. కాగా, మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి దర్వకత్వంలో సినిమాలు చేయనున్నాడు.