నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు చాలా సందడి చేశారు. కరోనా నేపథ్యంలో బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరిపారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు కానుకగా గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్మెంట్ టీజర్ కూడా విడుదలైంది. ఇది చూసిన తర్వాత నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.. అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ అభిమానుల మనసును తొలిచేస్తుంది.
దీనికి సమాధానం బాలయ్య పుట్టినరోజు నాడే బయటికి వచ్చింది. మోక్షజ్ఞ ఎంట్రీ అతి చేరువలోనే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ మైత్రి మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ నిర్మాణ సంస్థలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అది కూడా ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడి చేతిలో తన వారసుడిని బాలకృష్ణ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఉప్పెన సినిమాతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు.. నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఉప్పెన సినిమా ప్రత్యేకంగా కుటుంబంతో పాటు చూశాడు బాలకృష్ణ. సినిమా చూసిన తర్వాత చాలా సేపు బుచ్చితో మాట్లాడాడు బాలయ్య.
ఎంతో అద్భుతంగా తీసావ్ అంటూ ప్రశంసించాడు కూడా. అందమైన ప్రేమకథను అద్భుతంగా తీర్చిదిద్ది నీ దర్శకత్వ ప్రతిభను చూపించుకున్నావ్ అంటూ బుచ్చిబాబును ఆకాశానికి ఎత్తేసాడు నటసింహం. అంతేకాదు సినిమాకు పని చేసిన వాళ్లందర్నీ కూడా అభినందించాడు. ముఖ్యంగా తొలి సినిమానే అయినా కూడా వైష్ణవ్ తేజ్ నటన ఎంతో పరిణతి చెంది ఉందని చెప్పాడు బాలయ్య. హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాకు ప్రాణం అని చెప్పాడు ఈయన. సినిమాను ఓ అద్భుతమైన దృశ్య కావ్యంగా మార్చేసారని చెప్పుకొచ్చాడు బాలయ్య.
ఇవి కూడా చదవండి..
పవన్కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్సాబ్ డైరెక్టర్ తో నాని..!