సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 7 : రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.1888 పొం దాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్ కోరారు. బుధవారం మండలంలోని కాసరబాద గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్రాల్లో తూకాల్లో మోసానికి పాల్పడితే.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు రేణుక, ఎంపీటీసీ బంటు నాగయ్య, సీఈఓ వాసు, మార్కెట్ డైరెక్టర్ సంకరమద్ది రమణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ప్రవీణ్, నాయకులు నరేశ్, సైదులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం
రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వర్దమానుకోట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన వైస్ చైర్మన్ యానాల ఇంద్రసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ధ్యానాన్ని తెచ్చే ముందు ఆరబెట్టి తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంజ్ బోయిని శోభాలింగమల్లు, ఎంపీటీసీ ఈరేటి స్వప్న, డైరెక్టర్లు కోట సోమలింగం, కూరం వెంకన్న, బుర్ర శంకర్, ఏఓ గణేశ్, సీఈఓ రామస్వామి రైతులు పాల్గొన్నారు.
గుంపుల తిరుమలగిరిలో..
మండలంలోని గుంపుల తిరుమలగిరిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో తాసీల్దార్ రంగారావు, సర్పంచ్ కంచర్ల నిర్మలాగోవిందరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బూక్య వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ సీఈఓ శ్యాంసుందర్రెడ్డి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి