గ్రామీణ కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా బండి (Cinema Bandi) చిత్రానికి ఎంత మంచి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో ఆటో నడుపుతూ..సినిమా డైరెక్టర్ గా మారే వ్యక్తి పాత్రలో వికాస్ వశిష్ఠ (Vikas Vasishtha) కనబరిచిన నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రేజీ నటుడు ఇపుడు కొత్త చిత్రాన్ని షురూ చేశాడు. వికాస్ వశిష్ఠ హీరోగా నటిస్తున్న చిత్రం ఇవాళ ప్రారంభమైంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి శ్రీ చైతూ (Sree Chaithu) దర్శకత్వం వహించనున్నాడు.
సరస్వతి క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ భాస్కర్ రావు అన్నదాత నిర్మిస్తున్నారు. నిర్మాత భాస్కర్ రావు స్క్రిప్ట్ను శ్రీ చైతుకు అందించగా..గాయని సునీత ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టింది. ముహూర్తపు సన్నివేశానికి శ్రీ చైతు గౌరవ దర్శకత్వం వహించాడు. ఫీల్ గుడ్ ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ చిత్రంలో ప్రధాన భాగాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. బిందు మాధవి హీరోయిన్ గా నటిస్తోంది. బిగ్ బాస్ ఫేం పూజా రామచంద్రన్ కీలక పాత్ర పోషిస్తోంది. బిందు మాధవి చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తోంది.
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!