2021లో విడుదలైన సినిమాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఉప్పెన అయితే.. అత్యధిక లాభాలు తీసుకువచ్చిన చిత్రం జాతి రత్నాలు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాను అనుదీప్ కె.వి తెరకెక్కించాడు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 39 కోట్ల షేర్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు 20 కోట్లకు పైగా లాభాలు అందించింది. కరోనా మొదటి దశ పూర్తయిన తర్వాత విడుదలైన సినిమాల్లో జాతి రత్నాలు బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. అన్నింటికంటే చిట్టి సాంగ్ బాగా ఫేమస్ అయింది. చిన్న పిల్లలు కూడా ఈ పాటను బాగా పాడుకున్నారు. తాజాగా ఈ పాట 100 మిలియన్ క్లబ్ లో చేరిపోయింది.
‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందో నా గుండె ఖల్లాసే..’ అనే లిరిక్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. సీనియర్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించారు. మార్చి 29న యూట్యూబ్లో విడుదలైన ఈ పాట తాజాగా 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది. యుద్ధమేమి జరగలే.. సుమోలేవి అసలు ఎగరలే.. చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే పెల్చేసావే అంటూ క్యాచి లిరిక్స్ రాశాడు రామజోగయ్య శాస్త్రి. ఫోక్ సింగర్ రవి మిరియాల ఈ పాట పాడాడు. 100 మిలియన్ వ్యూస్ అందుకోవడంతో చిట్టి సాంగ్ సోషల్ మీడియాలో మరోసారి మార్మోగుతోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
MAA | ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జీవిత, హేమ.. కారణమిదే
Tollywood Drugs Case| రకుల్ ప్రీత్ సింగ్పై ఈడీ ప్రశ్నల వర్షం.. 6 గంటల పాటు విచారణ