కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చేస్తున్న సేవల అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి.ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుసుకున్న చిరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఇవి కరోనా రోగులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరోవైపు సినీ కార్మికులకు తన ట్రస్ట్ ద్వారా వ్యాక్సినేషన్ కూడా ఆరంభించారు. ఇక తాజాగా మరో మహోత్తర కార్యక్రమంకు శ్రీకారం చుట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తుంది.
వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరంజీవి అనుకుంటున్నారట. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే చిరు ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక లూసిఫర్, వేదాళం రీమేక్లు చేయనున్నాడు. బాబీ దర్శకత్వంలోను చిరు ఓ సినిమా చేస్తున్నాడు. ఇచ్చేఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించనున్నాడు మెగాస్టార్.