టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరోలైన చిరంజీవి, అక్కినేని నాగార్జున మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి వారిద్దరు మంచి ఫ్రెండ్స్గా మెలుగుతూ ఒకరికొకరు సపోర్ట్ అందించుకుంటూ వస్తున్నారు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని , కలిసి వెండితెరపై సందడి చేస్తే చూసి ఆనందించాలని అభిమానుల కల. కొన్నేళ్లుగా కలగానే ఉన్న ఈ కోరిక ఇప్పుడు నిజం కానుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. గతంలో రాఘవేంద్రరావు వీరిద్దరితో కలిసి మల్టీ స్టారర్ చేసిన వర్కవుట్ కాలేదు.
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విక్రమ్ వేదతో ఇది నిజం కానుందనే టాక్ నడుస్తుంది. పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ ‘విక్రమ్’ గా మాధవన్.. గ్యాంగ్ స్టర్ ‘వేద’ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయగా, తెలుగులోను రీమేక్ చేయనున్నారనే టాక్ కొన్నేళ్లుగా నడుస్తుంది. అప్పట్లో ఈ చిత్ర రీమేక్లో రవితేజ- పవన్ కళ్యాణ్ అని ప్రచారం జరిగింది. ఇప్పుడు నాగార్జున- చిరంజీవి అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇవికూడా చదవండి..