చిరంజీవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా వలన చిత్రానికి ఆటంకం ఏర్పడింది. తాజాగా చిత్రం నుండి మెగాస్టార్ లుక్ ఒకటి విడుదలైంది. ఇందులో మెడలో ఎర్రటి కండువా ధరించి చాలా వీరావేశంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
ఆచార్య సినిమాను దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేవాలయం సెట్ కోసం దాదాపు 10 కోట్లను ఖర్చు చేసారు. హైదరాబాద్ శివారులోని కోకాపేట్లో 20 ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్ సెట్ వేయగా, దీనిని కళా దర్శకుడు సురేష్ నేతృత్వంలో రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. సిద్ధా అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్ర పోషిస్తుండగా, ఆయన ఎందుకు నక్సలైట్గా మారాడనేది ఈ సినిమాలో కీలకం. పూజా హెగ్డే ఆయన సరసన కథానాయికగా నటించింది.