గాంధీనగర్ : కేంద్ర ప్రభుత్వ పథకం ఉడాన్ కింద గత రెండేళ్లలో గుజరాత్లో మొత్తం 19 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా వీటిలో నాలుగు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు తెలిపింది. రాష్ట్ర పౌర విమానయానశాఖ మంత్రి భూపేంద్రసింగ్ చుదాసమ లిఖితపూర్వంగా సభకు ఈ విషయాన్ని తెలియజేశారు.
31 డిసెంబర్,2020 వరకు గుజరాత్లో మొత్తం 19 విమాన సర్వీసులు ప్రారంభించబడ్డాయి. వాటిలో నాలుగింటి సేవలను నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్ జామ్నగర్, డయు, ముంద్రా, భావ్నగర్లకు అనుసంధానించే విమాన సర్వీసులు నిలిపివేయబడినట్లు పేర్కొన్నారు. ఆ మార్గంలో ఆర్థికంగా లాభదాయకం కానందువల్లే సదరు సంస్థ ఆ మార్గాల్లో సేవలను నిలిపివేసినట్లు తెలిపారు.