స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవిని చూసి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఆ కోవలో యర్రా నాగబాబు అనే అభిమాని కూడా ఉన్నారు. చిరంజీవి పిలుపు మేరకు నాగబాబు.. కోనసీమలో ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి చూపు లేని ఎంతో మందికి కంటి చూపు ప్రసాదించారు. ఆయన చేసిన సేవలకు చాలా మంది ప్రజలు నాగబాబుపై మన్ననలు కురిపించారు. అయితే కొద్ది రోజుల క్రితం కరోనాతో కాకినాడ ఆసుపత్రిలో చేరిన నాగబాబు కన్నుమూసారు.
యర్రా నాగబాబు మృతి విషయం తెలుసుకున్న చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. కొద్ది రోజుల క్రితం అతనితో మాట్లాడినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. కాని ఇలా కరోనాతో మరణించడం బాధగా ఉంది. అతడి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సారీ నాగబాబు, మిస్ యూస అంటూ చిరంజీవి సంతాపం తెలిపారు.