ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు అందరు తమ నాన్నతో ఉన్న అనుబంధాలని గుర్తు చేసుకుంటూ వారితో దిగిన రేర్ ఫోటోస్ని షేర్ చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా తన నాన్నతో దిగిన ఫొటోని షేర్ చేస్తూ..మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి ఫాదర్స్ డే శుబాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
చిరంజీవి గత ఏడాది కరోనా సమయం నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. చిరు చేసే ట్వీట్స్ కి కొద్ది నిమిషాలలోనే వేల కొలది లైకులు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్లు చేయనున్నారు. చిరు కరనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగాను కీర్తింపబడుతున్నారు.