ఆంధ్యజ్యోతి- ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ ఈ రోజు అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్త విని ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కనక దుర్గ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ సంస్థల ఎం.డి, జర్నలిస్ట్.,సంపాదకులు శ్రీ వేమూరి రాధాకృష్ణగారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారు తుదిశ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. జీవిత భాగస్వామికి నిజమైన నిర్వచనంగా మీ ప్రతి అడుగులో అడుగువేసిన కనక దుర్గ గారు ఇలా అకాల మరణం చెందడం ఎంతగానో బాధించింది. ఇలాంటి కష్ట సమయంలో మీరు తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి..