కరోనా మహమ్మారి వలన ఎందరో లెజెండ్స్ని మనం కోల్పోతున్నాం. గత ఏడాది లెజండరీ గాయకులు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో కన్ను మూయగా, తాజాగా ప్రముఖ సీనియర్ వెటరన్ గాయకుడు జి ఆనంద్ కరోనాతో కన్నుమూశారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్నియల్లో.. ఎన్నియల్లో .. ఎందాకా అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి శ్రీ జి. ఆనంద్ కర్కశమైన కరోనా బారిన పడి ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను. మొట్ట మొదటిసారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన , అవినాభావ బంధం ఏర్పరిచింది. ఆయన కుటుంబ సభ్యులందరికి నా సంతాపం తెలియజేస్తున్నాను అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.