వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి రక్తదానం చేశారు. అనంతరం తన ట్విట్టర్లో బ్లడ్ ఇచ్చే సమయంలో తీసిన ఫోటోని షేర్ చేస్తూ.. రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. చిన్న పనితో ప్రాణాలను కాపాడడం, ఏ సంబంధం లేనివారికి రక్తాన్ని ఇచ్చి రక్త సంబంధం ఏర్పరచుకోవడం గొప్ప అదృష్టం అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. కరోనా మొదటివేవ్లోనూ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పది రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇది పూర్తైన తర్వాత లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరపుకోనుంది.