ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఒకరు కరోనా బారిన పడడంతో ఆయన ప్రస్తుతం కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం.
కరోనాతో తన అభిమాని ఇబ్బంది పడుతున్నాడని తెలిసి స్వయంగా కాల్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు చిరంజీవి. త్వరలోనే తగ్గిపోతుందని, ఏ మాత్రం అధైర్యపడొద్దని చిరు అభిమానికి ధైర్యాన్ని అందించారు. డాక్టర్తో కూడా మాట్లాడానని, ఏ మాత్రం ఆందోళన చెందొద్దని చిరు అన్నారు. చిరంజీవి వంటి స్టార్ హీరో స్వయంగా తనకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడంతో అభిమాని చాలా సంతోషంగా ఉన్నాడు.