న్యూఢిల్లీ: కర్నాటకలో ఓవైపు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. లాక్డౌన్ జూన్ 7 వరకు పొడిగించారు. అయినా జనాలు లాక్డౌన్కు మారో గోలి అంటున్నారు. బెళగావిలో ఆదివారం వందలాది మంది లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఓ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బెళగావి లోని మరడీమఠ్ ప్రాంతంలో ఇది జరిగింది. గుర్రం అంతిమయాత్రపై ఏఎన్ఐ వార్తాసంస్థ విడుదల చేసిన వీడియో చూస్తే ఎవరికైనా ‘బాప్రే’ అనిపించక మానదు. అనేకమంది మాస్కులు కూడా పెట్టుకోలేదు. సామాజిక దూరం పాటించలేదు. మస్త్ మరడి గ్రామంలో ఓ మత సంస్థకు చెందిన గుర్రం ఆదివారం ఉదయం మరణించిందని, గ్రామప్రజలంతా గుర్రం కళేబరాన్ని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి దహనం చేశారని బెళగావి జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గీ తెలిపారు. కరోనా నిబంధనల ఉల్లంఘనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం 14 రోజుల పాటు ఊళ్లోకి రాకపోకలను నిషేధించారు. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
#WATCH Hundreds of people were seen at the funeral of a horse in the Maradimath area of Belagavi, yesterday, in violation of current COVID19 restrictions in force in Karnataka pic.twitter.com/O3tdIUNaBN— ANI (@ANI) May 24, 2021