న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.302 తగ్గి రూ.44,269కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో రాత్రికి రాత్రే బంగారం ధరలు తగ్గడం, రూపాయి బలపడటం దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,571 వద్ద ముగిసింది.
అలాగే, దేశీయంగా వెండి ధరలు కూడా ఇవాళ భారీగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,533 తగ్గి రూ.65,319కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,852 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,731 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.55 అమెరికన్ డాలర్లు పలికింది.