ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేములో కనిపిస్తే అభిమానుల ఆనందం వేరే లెవల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫలక్నుమా ప్యాలెస్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కలిసారు. ఇద్దరు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఫొటోలు దిగారు. చిరంజీవి ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఫలుక్నామా ప్యాలెస్లో జరిగిన ఓ సమావేశంలో కపిల్దేవ్ను మెగాస్టార్ కలిశారు. చిరంజీవిత తన భార్య సురేఖతో సమావేశానికి హాజరు కాగా, అక్కడ కపిల్ దేవ్తో వారిద్దరు ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను చిరు తన ట్విట్టర్లో షేర్ చేస్తూ.. నా పాత మిత్రుడు కపిల్ దేవ్ని చాలా కాలం తర్వాత ఫలక్నుమా ప్యాలెస్లో కలవడం ఎంతో సంతోషంగా ఉంది అని చిరు అన్నారు.
ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఒక్కసారిగా గతంలోకి వెళ్లి, ఆ రోజులను గుర్తు చేసుకున్నాను. మనకు మొదటి వరల్డ్ కప్ అందించిన హర్యానా హరీకేన్ ఈయననే అంటూ మెగాస్టార్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, 1983లో జరిగిన ప్రపంచకప్లో భారత జట్టుకు కెప్టెన్గా ఉన్న కపిల్ టీమ్ భారతదేశానికి తొలి ప్రపంచకప్ను అందించి చరిత్రలో నిలిచారు.