మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. మెహర్రమేశ్, బాబీ సినిమాలతో బిజీ కానున్నాడు. ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ (Lucifer Remake) షూటింగ్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు చిరు. ప్రస్తుతం చిరంజీవి వైజాగ్ వెళ్లాడన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ చిరు వైజాగ్ కు వెళ్లింది ఎందుకో తెలుసా..? ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ కోసం వైజాగ్ వెళ్లాడట.
డీటాక్సిఫికేషన్, రెజువెనేషన్ ప్రక్రియలో భాగంగా వైజాగ్ లోని ఆయుర్వేదిక్ స్పా సెంటర్ లో వెళ్లినట్టు టాక్. గతంలోనే చిరు ఇదే స్పా సెంటర్ లో వారంపాటు ఉన్నారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజు కూడా చిరంజీవి వెంట ఉన్నారట. సాధారణంగా టాలీవుడ్ హీరోలు డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ కోసం విదేశాలకు వెళ్తుంటారు. కానీ చిరంజీవి మాత్రం ఈ సారి విదేశాలకు వెళ్లే పని పెట్టుకోకుండా ట్రీట్ మెంట్ కోసం వైజాగ్ నే ఎంచుకున్నాడు.
స్పా సెషన్ పూర్తవగానే లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. మలయాళ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రకు సరిపోయే హీరో కోసం వెతికే పనిలో ఉన్నారు మేకర్స్ అండ్ టీం. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజర్. మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ మాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి ఎలా కనిపిస్తాడని చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు చిరు అభిమానులు.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?