న్యూయార్క్, జూన్ 17: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు తెలుగు తేజం సత్య నాదెళ్ల కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. కంపెనీ స్వతంత్ర డైరెక్టర్ల బోర్డు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ప్రస్తుతం సంస్థకు నాదెళ్ల సీఈవోగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇకపై చైర్మన్గానూ కొనసాగనున్నారు. దాదాపు 30 ఏండ్లుగా మైక్రోసాఫ్ట్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అత్యున్నత స్థానాన్ని నాదెళ్ల అధిరోహించారు. గత నాయకత్వాలకు భిన్నంగా సంస్థను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ఘనత నాదెళ్లదే. అందుకే చైర్మన్ పదవీ ఆయన్ను వరించింది. ఇక ఇప్పటిదాకా చైర్మన్గా ఉన్న జాన్ థామ్సన్.. స్వతంత్ర డైరెక్టర్లకు నాయకుడిగా ఉండనున్నారు. ఇదిలావుంటే నాయకత్వ మార్పులతోపాటు ఒక్కో షేర్కు త్రైమాసిక డివిడెండ్గా 0.56 డాలర్లను ఇవ్వాలని తాజాగా జరిగిన సమావేశంలో బోర్డు నిర్ణయించింది. దీన్ని సెప్టెంబర్లో చెల్లించనున్నారు.
పేరు: సత్యనారాయణ నాదెళ్ల (53)
జననం: 19 ఆగస్టు 1967, హైదరాబాద్
చదువు: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్లో ప్రాథమిక విద్య
మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్
అమెరికా విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో
మాస్టర్ డిగ్రీ చికాగో యూనివర్సిటీలో ఎంబీఏ
భార్య: అనుపమ నాదెళ్ల
సంతానం: ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తె