మన్సూరాబాద్, జూలై 8 : సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంట బ్యాంకు కాలనీకి చెందిన శ్రీశైలం కుటుంబ సభ్యులకు రూ. 3 లక్షల ఎల్వోసీని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వార సీఎం కేసీఆర్ ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఈ పథకం ద్వార కార్పొరేట్, ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మిట్టకంటి సత్తిరెడ్డి, స్వామి, పండరీ, బెజవాడ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.