పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్ ఒకప్పుడు హీరోయిన్గా వెండితెరపై తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే. జ్యోతి లక్ష్మీ చిత్రం తర్వాత ఛార్మి సంచలన నిర్ణయం తీసుకుంది. నటిగా కాకుండా నిర్మాతగా కొత్త అడుగులు వేసింది. పూరీ జగన్నాథ్తో కలిసి వైవిధ్యమైన సినిమాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్తో ఛార్మి దూసుకుపోతుంది. ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తుంది.
శుక్రవారం నుండి ఛార్మి పెళ్లికి సంబంధించి పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. గతంలో పెళ్లి చేసుకోనని చెప్పిన ఛార్మి ఇప్పుడు సమీప బంధువుని చేసుకోబోతుందని జోరుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఛార్మి తన సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇప్పుడు నా కెరియర్ బెస్ట్ ఫేజ్లో ఉంది. నా జీవితం చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చేసుకోవడం అనే తప్పు నా జీవితంలో ఎప్పటికీ చేయనంటూ కుండ బద్దలు కొట్టేసింది ఛార్మి. దీంతో పుకార్లు అన్నింటికి పులిస్టాప్ పడింది.