బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ గేమ్ షో తరహాలో నాగార్జున తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ఓ షో చేశాడు. మూడు సీజన్స్ కింగ్ నడిపించగా, నాలుగో సీజన్కి చిరంజీవి హోస్ట్గా ఉన్నారు. తాజా సీజన్కు ఎన్టీఆర్ హోస్ట్గా ”ఎవరు మీలో కోటీశ్వరులు” షో ఉండబోతోంది. ఈ షో కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ క్విజ్ షో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న మొదలు కానుందని టాక్ నడుస్తోంది. తొలి ఎపిసోడ్కు గెస్ట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరన్ హాజరు కానున్నాడని ఆర్ఆర్ఆర్ స్టార్స్ షోలో తెగ సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ షో వేదికగా, ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి ప్రమోషన్స్ కూడా చేయనున్నారు. బిగ్ బాస్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన తారక్.. క్విజ్ షో కోసం 60 ఎపిసోడ్లకు గానూ 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.