చెన్నై : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ లేబొరేటరీలు నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షకు వసూలు చేసే చార్జీని రూ 900కు తగ్గించింది. తమిళనాడులో ఇప్పటివరకూ ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూడటంతో దీన్ని నోటిఫైడ్ డిసీజ్ గా ప్రభుత్వం గుర్తించింది.
ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 34,875 తాజా పాజిటివ్ కేసులు నమోదవగా, 365 మంది మహమ్మారి బారినపడి మరణించారు. తమిళనాడులో ఇప్పటివరకూ కరోనా వైరస్ తో 18,734 మంది ప్రాణాలు కోల్పోయారు.