న్యూఢిల్లీ: కరోనాపై పోరాటం కోసం ఇప్పటికే రూ.20 లక్షలతో పాటు ఈ ఏడాది ఐపీఎల్ క్యాష్ప్రైజ్లను విరాళంగా ఇచ్చిన భారత క్రికెటర్ ధవన్ మరోసారి ముందుకొచ్చాడు. వైరస్ బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గుర్గ్రామ్ పోలీసులకు అందించాడు. ‘ నా ప్రజల కోసం కొంచెమైనా సాయం చేయడం కృతజ్ఞతగా భావిస్తున్నా. ఈ మహమ్మారి నుంచి భారత్ త్వరలోనే కోలుకుంటుంది’ అని ధవన్ ట్వీట్ చేశాడు.