చైత్రా రాయ్ బుల్లితెర ప్రేక్షకులకి చాలా సుపరిచితం.తెలుగు, కన్నడ సీరియల్స్లో నటించిన చైత్రా రాయ్ .. ఒకరికి ఒకరు, మనసున మనసై, దటీజ్ మహాలక్ష్మీ ఇలా వరుసగా సీరియల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది. ఫుల్ ఫాంలో ఉన్న సమయంలో ఆమెకు అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ ఆఫర్ వచ్చింది. కాని దాని నుండి సడెన్గా తప్పుకొని అందరికి షాక్ ఇచ్చింది.
చైత్రా రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ నెటిజన్స్ని అలరిస్తూ ఉంటుంది. ఆ మధ్య సీమంతం వేడుకలు, బేబీ బంప్ ఫోటో షూట్లు చేసి నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఇక సోమవారం (ఆగస్ట్ 16) మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చాను అని చైత్రా రాయ్ తన అభిమానులకు తెలిపారు. ఇట్స్ బేబీ గర్ల్ అంటూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఆడబిడ్డకు జన్మనిచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.
ఈ ఫీలింగ్ ఇంతకముందు ఎన్నడు కలుగలేదు. ప్రసన్న శెట్టి,నాకు, ఇతర బంధువులు అందరికీ ఎంతో ఆనందించ్చింది. మా ఈ ఆనందంలో పాలు పంచుకుంటున్న అందరికీ థ్యాంక్స్ అని చైత్రా రాయ్ తన పోస్ట్లో కాస్త ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చైత్రా రాయ్కి యాంకర్ విష్ణు ప్రియ, సుష్మ, మంజు కళానిది వంటి తారలంతా కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు.