రాఖీ పండుగ వేడుక దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రక్షా బంధన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా స్టార్స్ ఇంట కూడా ఈ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు తమ సోదరీమణులు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకోగా, అందుకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ అయింది.
ఇక మహేష్ గారాల పట్టి సితార తన అన్నయ్య గౌతమ్పై తనకున్న ప్రేమను చాటింది.ఇందుకు సంబంధించిన ఫొటోని నమ్రత షేర్ చేయగా, ఇందులో ఇద్దరు చిన్నారులు చాలా క్యూట్గా కనిపిస్తున్నారు. ఇక పవన్, రేణూ దేశాయ్ ల కూతురు ఆద్య.. అన్నయ్య అకీరాకి రాఖీ కట్టగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. అల్లు అర్జున్ ముద్దులు కూతురు అర్హ.. తన అన్నయ్య అయాన్కి రాఖీ కట్టింది. ఆ పిక్స్ స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి తెగ వైరల్ అయ్యాయి.