ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోపై గెలిచి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం గెలుపొందింది. ఇలా వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకం సాధించిన షట్లర్గా రికార్డ్ నెలకొల్పింది.
సింధు తన పతకంతో భారతీయులు గర్వంగా ఫీలయ్యేలా చేసింది.ఈ క్రమంలో ఆమెకు దేశ ప్రధాని, రాష్ట్రపతితో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిరంజీవి, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోల నుంచి ప్రతీ ఒక్కరూ పీవీ సింధుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా రెండు ఒలంపిక్స్లో పతకాలు గెలిచిన మొట్టమొదటి మహిళగా రికార్డులకెక్కిన పీవీ సింధుకు కంగ్రాట్స్. ఈ ఒలంపిక్స్లో ఇప్పటి వరకు వచ్చిన రెండు పతకాలు మహిళలే సాధించడం ఆనందంగా ఉంది. మన మహిళా శక్తికి అడ్డు ఏది లేదు.. ఇండియాను గర్వంగా తలెత్తుకునేలా చేయండి అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇదో చారిత్రాత్మక విజయం. భారత దేశం గర్వించదగ్గ విజయం. కాంస్యం గెలిచిన సింధుకు కంగ్రాట్స్. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది మహేష్ బాబు అన్నారు. ఇక మోహన్ బాబు , మంచు లక్ష్మీ, అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్, సమంత, మెహ్రీన్, గోపీ మోహన్, సందీప్ కిషన్, కుష్బూ, శరత్ కుమార్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్, తమన్నా, మోహన్ లాల్, నాగ శౌర్య వంటి వారంతా కూడా సోషల్ మీడియాలో సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.