ఏడీఏ మిలింద్ కుమార్
జిల్లా కేంద్రంలో విత్తన డీలర్లతో సమావేశం
పలు గ్రామాల్లో రైతులకు అవగాహన
ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని డివిజన్ వ్యవసాయాధికారి మిలింద్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రైతు వేదిక భవనంలో విత్తన డీలర్లతో గురువారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 80 శాతంపైన పత్తి సాగు చేశారన్నారు. లైసెన్స్ గల డీలర్ నుంచి మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. వచ్చే వానకాలం పంటల నమోదు కార్యక్రమంలో రైతులు విత్తనాల రసీదును చూపకపోతే, పంటను పరిశీలిస్తామని, నకిలీ విత్తనాలతో సాగు చేసినట్లు నిర్ధారణ అయితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామన్నారు. విత్తనాల కొనుగోలు చేస్తే రసీదును రైతులకు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్హెచ్వో అశోక్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. పోలీస్ శాఖ తరఫున ఇంటెలీజెన్స్ నుంచి గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలపాలు చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. సమావేశంలో ఏవో ఖాదర్ హుస్సేన్, ఏఈవోలు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.
గ్రామాల్లో రైతులకు అవగాహన..
నకిలీ విత్తనాలు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని ఏవో ఖాదర్ హుస్సేన్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో సంబంధిత ఏఈవో, వీఆర్ఏ, గ్రామ పోలీస్ అధికారి కమిటీగా ఏర్పా టు చేశామన్నారు. మండలస్థాయిలో వ్యవసాధికారి, తహసీల్దార్, ఎస్హెచ్వో కమిటీలో ఉంటారని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతులు, ఏఈవో సాయి శృతి, తదితరులు ఉన్నారు.
జైనూర్, ఏప్రిల్ 29: మండలకేంద్రంలోని జిన్నింగ్ మిల్లులో ఏవో పవన్కుమార్ మండల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు నిషేధిత మందులు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఎరువులు, విత్తనాలు, మందుల విక్రయాలకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐ తిరుపతి, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది, మండల వ్యాపారులు పాల్గొన్నారు.
పెంచికల్పేట్ , ఏప్రిల్ 29 : నకిలీ విత్తనాలు, గడ్డి మందులు వాడి రైతులు నష్టపోవద్దని ఇన్చార్జి ఏడీఏ రాజుల నాయుడు సూచించారు. మండలంలోని గుంట్లపేట గ్రామంలో ఆత్మా ఆధ్వర్యంలో గురువారం రైతులకు అవగాహన కల్పించారు. పొలాల్లో ైగ్లెసిల్ విత్తనాలు, ైగ్లెఫోసెట్ గడ్డి మందులు వాడితే కలిగే నష్టాలు , ఆరోగ్య సమస్యలను వివరించారు. ఆయనతో పాటు ఏఈవో గౌషియాబేగం, రైతులు పాల్గొన్నారు.
కాగజ్నగర్టౌన్ , ఏప్రిల్ 29 : మండలంలోని వల్లకొండ గ్రామంలో నకిలీ విత్తనాలు, నిషేధిత కలుపు మందు ైగ్లెపోసెట్ వాడకం వల్ల కలిగే నష్టాలపై ఏఈవో రోహిణి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో దిగుబడి తగ్గుతుందని, ైగ్లెఫోసెట్ మందుతో క్యాన్సర్, దురద లాంటి చర్మ వ్యాధుల బారినపడుతారన్నారు. సర్పంచ్ సునీత, రైతులు పాల్గొన్నారు.