బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. బాంబే టాకీస్ యజమాని ఈయనకు దిలీప్ కుమార్ అని నామకరణం చేశాడు. 1922 డిసెంబర్ 11న పాకిస్తాన్లోని పెషావర్లో జన్మించారు. పౌరాణిక చిత్రం ‘మొఘల్-ఎ-ఆజామ్’తో ఆయన ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. 1944 నుంచి 1998 వరకు దిలీప్ కుమార్ చిత్రసీమను ఏలారనే చెప్పాలి.
అందగాడు, మంచి నటుడు దిలీప్ కుమార్ మరణ వార్త సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తపై సినీ సెలబ్స్ ఓ శకం ముగిసింది. బాలీవుడ్ లెజెండ్స్లో మరో యాక్టర్ కన్నుమూయడం బాధకు గురి చేస్తుందని పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ దిలీప్ కుమార్ మరణ వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. దిలీప్ కుమార్ ఒక సినిమా లెజెండ్గా ఎప్పటికీ అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన అసమాన నటన ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. దిలీప్ కుమార్ మృతి సినీ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మోదీ ట్వీట్ లోతెలిపారు.
దిలీప్ కుమార్ మృతిపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ఇండియన్ సినిమాకు దిలీప్ కుమార్ అందించిన సేవలు వెలకట్టలేనివి. మిమ్మల్ని తప్పక మిస్ అవుతాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అని ఎన్టీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.