కరోనా వలన ఇటీవలి కాలంలో వేడుకలు చాలా తగ్గాయి. సెలబ్స్ పార్టీలు చేసుకోవడమే మానేశారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కాస్త శాంతిస్తుండడంతో బర్త్ డే పార్టీలలో పాల్గొంటున్నారు. ఆ మధ్య సుహాసిని బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోగా, ఆ పార్టీలో కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, రమ్యకృష్ణ, కుష్బూ మరియు బంధుమిత్రులు తెగ సందడి చేశారు. ఇక మరో సీనియర్ నటి సుమలత కూడా ఇటీవల తన బర్త్ డే వేడుక జరుపుకోగా, ఆ వేడుకకు కన్నడ నటుడు ఉపేంద్ర, కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ ఫేమస్ అయిన యష్ అటెండ్ అయ్యారు.
ఇక సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ 51వ బర్త్ డే కావడంతో ఈ అమ్మడు తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య బర్త్ డేని గ్రాండ్గా జరుపుకుంది. రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. పార్టీలో ప్రతి ఒక్కరు పుల్ చిల్ అయినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఖుష్బూ.. రమ్య బర్త్ డే వేడుకకు సంబంధించిన పిక్స్ షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి. రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలలో రమ్య ముఖ్య పాత్రలు పోషిస్తుంది.